టీటీడీకి వెయ్యి ఆవులిస్తా: బీసీవై అధ్యక్షుడు

67చూసినవారు
టీటీడీకి వెయ్యి ఆవులిస్తా: బీసీవై అధ్యక్షుడు
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. టీటీడీకి వెయ్యి ఆవులు ఇస్తానని, టీటీడీ సొంత డెయిరీని పెట్టి.. ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారీకి వాడాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమలలో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, సగటున రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్