AP: ఎన్నికలకు సంబంధించి ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు మండిపడ్డారు. వైసీపీ గెలుస్తుందంటూ ఆరా మస్తాన్ కూడా ముంచేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ మరో లగడపాటి అయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వల్ల వైసీపీ నేతలంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని అన్నారు.