మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హెల్త్ అలవెన్స్ రూ. 6 వేలు వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని చెప్పామని.. పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని తెలిపారు. ప్రమాద పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచామన్నారు. మరికొన్ని డిమాండ్లకూ మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలన్నారు.