నాణ్యతమైన ఆహారం అందించాలి: ఎమ్మెల్యే

61చూసినవారు
నాణ్యతమైన ఆహారం అందించాలి: ఎమ్మెల్యే
హుకుంపేట మండలం పరిధిలో గల అల్లాంపుట్టు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో.. శనివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఎమ్మెల్యే పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ.. వారికి పెట్టే ఆహారం నాణ్యతగ అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆహారం నాణ్యతగా ఉండటం లేదు అనడంతో ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అలాగే స్కూల్ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్