![గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చిన ఎంపిటిసి సభ్యురాలు గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చిన ఎంపిటిసి సభ్యురాలు](https://media.getlokalapp.com/cache/db/66/db6689c5f61630fb67a088607bb58061.webp)
గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చిన ఎంపిటిసి సభ్యురాలు
వేసవి కాలం దృష్ట్యా చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మండలంలోని చింతపల్లి పంచాయతీ పరిధి రామాలయం వీధిలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్పందించిన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు ధారలక్ష్మి బుధవారం ఉదయం సొంత నిధులతో రామాలయంవీధిలో ట్యాంకర్ వాహనం ద్వారా తాగునీటి కష్టాలు తీర్చారు. గిరిజనులు ఎంపీటీసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.