బుచ్చయ్య పేట: భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత

65చూసినవారు
బుచ్చయ్య పేట: భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత
బుచ్చయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామంలో విజిలెన్స్, రెవెన్యూ సిబ్బంది శనివారం సాయంత్రం సంయుక్తంగా దాడి చేసి 2618 కేజీల పిడిఎస్ బియ్యం స్వాధీనపరచుకున్నారు. వాటిలో 2018 కేజీ లు వై. సతీష్ కు చెందినవి కాగా 600 కేజీలు ఉడత సత్తిబాబుకి చెందినవిగా గుర్తించారు. ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని గోదాంకి తరలించినట్లు సిఎస్ డి టీ కె. ఈశ్వరరావు తెలిపారు. ఈ రైడ్ లో విజిలెన్స్ సీఐ తిరుపతి రావు, ఎస్ఐ మురళి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్