ఏలేరు కాలువకు గండి

53చూసినవారు
విశాఖ నగరానికి తాగునీటిని సరఫరా చేసే ఏలేరు కాలువకు మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం గండి పడింది. కాలువ గట్టు బలహీనపడడం వల్ల గండి పడిందని స్థానిక రైతులు తెలిపారు. కాలువలో నీరంతా పక్కనే ప్రవహించే జాగిరాల గెడ్డలోకి వృధాగా పోతుంది. జి నగరం, కోడూరు గ్రామ పరిధిలో గల పొలాలు ముంపుకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్