కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకు జగన్ ను దేవుడిగా పూజించేవారు. వైసీపీ పరాజయం పాలు కావడంతో అన్నిచోట్ల జగన్ బొమ్మలను తొలగిస్తున్నారు. నాతవరం మండలం శృంగవరం గ్రామంలో సచివాలయంపై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను పలువురు బుధవారం సుత్తితో పగులగొట్టారు.