58 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక

66చూసినవారు
58 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక
పి యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం ఘనంగా జరిగింది. 1964 నుండి 1969 వరకు ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వీరు అంతా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. అప్పట్లో విద్యార్థులు అయినప్పటికీ ఇప్పుడు మాత్రం వృద్ధులే. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ వీరి అందరి కలయిక మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపుగా 58 సంవత్సరాల తర్వాత ఈ వృద్ధులైన విద్యార్థులు ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి వీరంతా మంచి, చెడు కష్టాలు, సుఖాలు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. ఈ ఏడాదిలో పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన జి హెచ్ ఎస్ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులకు నగదు బహుకరణ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్