కోటవురట్లలో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు

72చూసినవారు
కోటవురట్లలో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
కోటపురట్లలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం. లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్ గా తుమ్మల శ్రీను, వైస్ చైర్ పర్సన్ గా వంగలపూడి దేవుడమ్మ ను, 22మంది పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరితో తీర్మానం రాయించుకుని ప్రమాణ స్వీకారం చేయించారు.