శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు. రాత్రికి తిరుమల చేరుకుని వకుళామాత అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, మధ్యాహ్నం 12 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.