డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉంది. ఆ మార్గంలో రాకపోకలకు తమను అనుమతించరని, ఓటేసే అవకాశం కోల్పోతామని ఆ కుటుంబం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు కలెక్టరేట్కు, ఎన్నికల పరిశీలకుడి దృష్టికి వెళ్ళాయి. పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు నడుమ ఆ దంపతులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.