ఆంధ్రప్రదేశ్ లో రెండో కాణిపాకంగా వెలుగొందుతోన్న అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయం భూ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు శనివారం తెల్లవారు జామున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు తొలి పూజల అనంతరం బొజ్జ గణపయ్యకు పంచామృత అభిషేకం, విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి చోడవరంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.