పెద్దేరు ద్వారా 570 క్యూసెక్కుల నీరు విడుదల

79చూసినవారు
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా మంగళవారం రాత్రి 9 గంటలకు 570 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పెద్దేరు ఎ ఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలాశయం మొత్తం నీటిమట్టం 137 మీటర్ల కాగా మంగళవారం రాత్రికి 136. 55 మీటర్లకు చేరుకోవడంతో పాటు జలాశయంలోకి 1320 క్యూసెక్కుల నీరు చేరడంతో స్పిల్ వే ద్వారా 550 క్యూసెక్కులు, రాచకట్టు, ఆర్ఎంసి ద్వారా 10 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్