ఇంటింటా సత్య సాయి భజనలు చేయండి

70చూసినవారు
భగవాన్ సత్యసాయి బాబా నూ ప్రజలకు మరింత చేరువ చేయాలని సత్య సాయి సేవా సంస్థల అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుకసిరెడ్డి అప్పల నాయుడు విజ్ఞప్తి చేసారు. ఆదివారం సాయంత్రం మాడుగుల మందిరాన్ని సందర్శించిన ఆయనమాట్లాడుతూ ప్రతి ఇంటికి బాబా భజనలు చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అప్పకరాజపురం సమితి కన్వీనర్ లక్ష్మీ నాయుడు, రామారావు మాస్టర్, మాడుగుల సమితి కన్వీనర్ కొప్పోజి శ్రీనివాస్, మండల ఇన్చార్జి పి బలరాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్