మృతుడి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ ఆర్థిక సాయం

1091చూసినవారు
మృతుడి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ ఆర్థిక సాయం
మాడుగుల నియోజకవర్గం కింతలి వల్లాపురం విశాఖ డెయిరీ పాల సెంటర్ కు జోగ సింహచలం అనే పాడిరైతు గత 5 ఏళ్లుగా పాలు సరఫరా చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఆ పాడిరైతు గుండెపోటుతో మృతి చెందాడు. దీనితో మృతిపై స్పందించిన ఆ గ్రామ పాల యాజమాన్యం మృతుడి కుటుంబ సభ్యులకు శుక్రవారం 20 వేల రూపాయల చెక్ ను అందజేశారు.మాజీ సర్పంచ్ టి సోమన్నదోర, పాల ప్రెసిడెంట్ బి నాగేశ్వరరావు, పాల సెక్రటరీ అప్పారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్