బాధితులను పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే

79చూసినవారు
బాధితులను పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే
గాజువాక శ్రావణి షిప్పింగ్ కంపెనీలో శుక్రవారం రాత్రి విషవాయువులు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురై షీలా నగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. శనివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్