వికలాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి: జేఏసీ నాయకులు

60చూసినవారు
కళ్యాణదుర్గంలోని ఆర్. అండ్. బి అతిథి గృహంలో శనివారం దివ్యాంగుల జేఏసీ నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విశాఖ జిల్లా గాజువాకలో ఒక వికలాంగుడు వేమిరెడ్డిని గొంతు కోసి దారుణంగా చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఇలాంటివి రాష్ట్రంలో మరెక్కడ పునరావృతం కాకుండా చూడాలన్నారు. దివ్యాంగులపై జరుగుతున్న హత్యలను అరికట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులపై దాడులను ఆపాలన్నారు.

సంబంధిత పోస్ట్