ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం

50చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక విగ్రహాలను కూర్చోబెట్టి ఐదు రోజులు కావడంతో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వాల్మీకి సర్కిల్ లో కూర్చోపెట్టిన వినాయకులను ట్రాక్టర్ల పై ఉంచి ప్రత్యేక అలంకరణతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. వినాయక విగ్రహాలకు అడుగడుగునా భక్తులు పూజలు నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డిఎస్పి తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్