పొలం గట్లపై నడిచిన జిల్లా కలెక్టర్

76చూసినవారు
ఆత్మకూరు మండలం బి. యాలేరు గ్రామంలో సాగుచేసిన వివిధ పంట పొలాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఉదయం పరిశీలించారు. వరి పైర్లు సాగు చేసుకున్న రైతు పొలాల గట్లపై ఆయన గొడుగు పట్టుకుని నడిచారు. రైతన్నలకు అనునిత్యం అండగా ఉంటూ. వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించమని కలెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్