అనంతపురం నగరం పాతూరులో గురువారం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 8వ డివిజన్ టీడీపీ నాయకుడు రాప్తాడు రంగా ఆధ్వర్యంలో ఆయనను అడ్డుకున్నారు. తమ నాయకుడు లేకుండా ప్రచార కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆయనను ప్రశ్నించారు.