మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపారు (వీడియో)

71328చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ రోజు మోమిన్, గౌరవ్ అనే ఇద్దరు యువకుల మధ్య మద్యం మత్తులో చిన్న గొడవ జరిగింది. దీంతో గౌరవ్ మరియు అతని స్నేహితులు మోమిన్ ను ఒక ఇనుప రాడ్ తీసుకోని దారుణంగా కొట్టి పరారయ్యారు. గాయపడిన మోమిన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్