ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. కాగా, చీరాల అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని ఆమంచి పట్టుబట్టగా.. వైసీపీ హైకమాండ్ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీకి గుడ్బై చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి బరిలో దిగే అవకాశముంది.