పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

69చూసినవారు
పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అందరికీ సంపూర్ణ ఆహారం అందించడమే ప్రభుత్వం లక్ష్యమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ బుధవారం పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోదకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్