
ధర్మవరం: కార్మికుల సమస్యలు తీర్చండి
కరోనా సమయం నుండి ధర్మవరం పురపాలక సంఘంలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెల 15 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కార్మిక సంఘం నాయకులు బాబు ముకుంద డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా సమయం నుండి 87 మంది కార్మికులు రోజు కూలీ కింద తక్కువ వేతనంతో పని చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.