సీఎం చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

85చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసిన వీహెచ్ ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్