రెండవ రోజు మూడు నామినేషన్లు దాఖలు

1071చూసినవారు
రెండవ రోజు మూడు నామినేషన్లు దాఖలు
నామినేషన్ల స్వీకరణల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్, నియోజకవర్గ ఆర్ఓ అభిషేక్ కుమార్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ రెండు సెట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసమితి అభ్యర్థిగా కోడుమూరు నౌషాద్ నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్