ఏపీలో
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా
టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం సీఎం
జగన్ సమక్షంలో ఆయన
వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగే సమావేశంలో ఆడారి కిషోర్ను సీఎం
జగన్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.