వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 51కుటుంబాలు
కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 28 వైసీపీ ముస్లిం కుటుంబాలు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త గంగమ్మతో పాటు 22 కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం టిడిపిలోకి చేరారు. వారికి సురేంద్రబాబు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.