మిలదున్ నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోండి: సీఐ

64చూసినవారు
మిలదున్ నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోండి: సీఐ
మిలదున్ నబీ పండుగ సందర్భగా గోరంట్ల పట్టణంలో సోమవారం ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ర్యాలీని శాంతియుతంగా నిర్వహించుకోవాలని గోరంట్ల సీఐ శేఖర్ పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల పోలీస్ స్టేషన్ లో ముస్లిం మత పెద్దలతో సీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ర్యాలీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్