సోమందేపల్లి: పొంగిపొర్లుతున్న పత్తికుంటపల్లి చెరువు

57చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా, సోమందేపల్లి మండలంలోని పత్తికుంటపల్లి గ్రామ చెరువు మరవ పారుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి బుధవారం పొంగి పొర్లుతోంది. దీంతో పత్తికుంటపల్లి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పత్తికుంటపల్లి మరవ పారడంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లి గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్