చిలమత్తూరు లో గడ్డి వాముకి నిప్పు

5576చూసినవారు
చిలమత్తూరు మండలంలోని లాలేపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టటంతో రైతు శ్రీరామప్పకు సంబంధించిన గడ్డివాము దగ్ధమైంది. దీంతో రైతుకు సుమారు 50 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు శ్రీ రామప్ప వాపోయారు. అసలే వేసవికాలం కావడంతో పశువులు మేత లేక అల్లాడిపోతున్నాయి. ఈ పరిస్థితులలో నిలువ చేసుకున్న గడ్డివామి కాలిపోవడంతో రైతు శ్రీరామప్ప ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వం తనని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్