పీర్ల చావిడిల ముందు వెలిగించిన అగ్నిగుండం

580చూసినవారు
రాయదుర్గం పట్టణంలో మొహరం వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అలాయి వేడుకలు వైభవంగా ప్రారంభించారు. పీర్ల చావిడిల ముందు పెద్ద ఎత్తున అగ్ని గుండాలు వెలిగించారు. కోటలో కుమ్మరి వీధి పీర్ల చావడి వద్ద డీజేలకు యువకులు, చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు పానకాలు, చిత్రాన్నం ప్రసాదంగా అందజేశారు. మసీదు చావడిలి వద్ద చక్కెర చదివింపులు, పానకాలు చదివించుటకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్