ఎంఈఓ నాగమణిని సస్పెండ్ చేయాలని డిమాండ్: సంగం నాయకులు

554చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ నాగమణిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏ వి ఆర్ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అమ్ముతుండడంపై విద్యార్థి యువజన సంఘం నాయకులు దాడులు చేశారు. వెంటనే ఏవిఆర్ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివ, సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్