రాయదుర్గం: ఏవిఆర్ కార్పొరేట్ కళాశాల ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పదవ తరగతి విద్యార్థులకు ముందస్తుగా సిలబస్ చెబుతూ క్లాసులు నడుపుతున్నడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, ఎన్ ఎస్ యు వై జిల్లా నాయకులు అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏవిఆర్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పదవ తరగతి క్లాసులు నడుపుతుండడంతో అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.