రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతుంది

53చూసినవారు
రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతుంది
రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని 20వ వార్డులో ఆయన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గడపగడపకు తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్