సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి

81చూసినవారు
సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
ఏపీలోని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణించారు. ఈ నెల 21వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు దేవస్థానం స్టోర్‌లో తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొననుగోలు చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్