
YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వైసీపీ ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు నిషేధించారు. గత 3 రోజుల క్రితం ఫయాజ్ బాషా, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశ్యంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.