వైఎస్సార్సీపీకే పట్టం కట్టండి
ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు హీరాపురం ఫయాజ్ బాషా కోరారు. గురువారం ఆయన తాడిపత్రి పట్టణంలోని వడ్లపాలెం, శాస్త్రీ నగర్, బుక్కపట్నం వీధుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.