అతిథి గృహం నిర్మించండి

1939చూసినవారు
అతిథి గృహం నిర్మించండి
పుట్లూరు మండల కేంద్రంలో అతిథి గృహ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పుట్లూరు మండల బిజెపి అధ్యక్షులు రాగేని రామంజి యాదవ్ శనివారం పేర్కొన్నారు. మండలంలోని తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా అధికారులు మండల పర్యటనకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి & ప్రజలు తమ సమస్యలను తెలుపుకోవడానికి అతిథి గృహం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్