తాడిపత్రి మండలంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పోలీసులు నిర్వహించారు. ఇందులో భాగంగా తాడిపత్రి రూరల్ అప్ గ్రేడ్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు సదస్సులు నిర్వహించారు. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లి బంగారు లాంటి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.