తాడిపత్రి లోని పలు వంతెన లపై గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా నాయకులు పేర్కొన్నారు. బుధవారం అర్ అండ్ బీ అధికారి సురేశ్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందలపాడు వద్ద ఉన్న రైల్వే వంతెనపై భారీగా గుంతలు పడ్డాయన్నారు. పెన్నానది కొత్తవంతెనపైనా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. భాజపా పట్టణాధ్యక్షుడు ఆంజ నేయులు తదితరులు పాల్గొన్నారు.