తాడిపత్రి పట్టణం సంజీవనగర్ లోని వేద గాయత్రీదేవి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 3న బాలత్రిపుర సుందరీ అలంకారం, 4న రాజరాజేశ్వరీదేవి అలంకారం, 5న గాయత్రీదేవి అలంకారం, 6న అన్నపూర్ణాదేవి అలంకారం, 7న లలితా త్రిపురసుందరి అలంకారం, 8న, మహాలక్ష్మీ అలంకారం, 9న సరస్వతీదీవి అలంకారం, 10న దుర్గాదేవి అలంకారం, 11న మహిషాసుదరమర్ధిని అలంకారం, 12వ తేదీ రజత కవచం అలంకారంలో గాయత్రీ దేవి భక్తులకు దర్శనమివ్వనునన్నారు.