అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్

64చూసినవారు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్
తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామ సమీపంలో ఆదివారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందిందని, దీంతో వెంటనే దాడులు చేసి ఆ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామని అన్నారు. అనంతరం డ్రైవర్లు లోకేష్, సుదర్శన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్