ఉరవకొండ మండలం పెద్ద ముష్టురులో సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏడీఏ పద్మజ, ఏవో శుభకర్ ప్రారంభించారు. విత్తన పంపిణీని రైతులు వినియోగించుకోవాలని, డివిజన్కు కావాల్సినంత వేరుశనగ విత్తనం సరఫరా జరిగిందని రైతులకు తెలిపారు. మోపిడి, ఇంద్రావతి, రాకెట్ల రైతు భరోసా కేంద్రాలను సందర్శించి విత్తన పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్బికే సిబ్బంది పాల్గొన్నారు.