ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించండి

77చూసినవారు
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించండి
ఉరవకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సుబ్బరాజు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు, బయోమెట్రిక్ అటెండెన్స్ తదితర విషయాలపై వారితో మాట్లాడారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ సూచించారు. త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలిపారు.

సంబంధిత పోస్ట్