ఆధిపత్య పోరులో భాగంగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గంగవరం గ్రామంలో గతంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు ఇరువర్గాలను స్టేషను కు పిలిపించారు. ఆ సమయంలోనూ వాదులాడుకుని, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఇరువర్గాలకు చెందిన 16 మందిని బైండోవర్ చేశారు.