కూడేరు ఎంఈవోకు 14 రోజుల రిమాండ్

59చూసినవారు
కూడేరు ఎంఈవోకు 14 రోజుల రిమాండ్
లంచం తీసుకుంటూ పట్టుబడిన కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ ను ఏసీబీ అధికారులు కర్నూలు ఏసీబీ కోర్టులో గురువారం హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14రోజులు రిమాండ్ విధించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు కూడేరు ఎంఈవో కార్యాలయంలో రాత్రంతా విచారించి, కేసు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. తెల్లవారుజామున వాహనంలో కర్నూలుకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్