సచివాలయ సిబ్బంది నిర్దేశిత సమయానికి విధులకు హాజరు కావాలి

60చూసినవారు
సచివాలయ సిబ్బంది నిర్దేశిత సమయానికి విధులకు హాజరు కావాలి
సచివాలయ సిబ్బంది నిర్దేశ సమయానికి విధులకు హాజరుకావాలని ఎంపీడీవో సుబ్బరాజు సూచించారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని 3, 5 సచివాలయాలతో పాటు మండల పరిధిలోని బూదగవి సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హాజరు పుస్తకాన్ని పరిశీలించి బయోమెట్రిక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సమయపాలన పాటించాలని, కార్యాలయ వేళల్లో ప్రజలకు అందుబాటులో సేవలందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్