ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు వెలగపూడిలోని సచివాలయంలో తొలిసారి భేటీ కానుంది. ఈ ఉప సంఘానికి హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి కమిటీలో సభ్యులుగా ఉన్నారు.